Skip to main content

CHIDHAMBARAM TEMPLE STORY

Stories:
చిదంబర ఆలయం:
తమిళనాడు లోని చిదంబరం లో ఉండే ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం లో  శివకేశవుల ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం ఎత్తైన గోపురాలు, ప్రాకారాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి తొమ్మిది ధ్యారాలు, ఆలయంలో అయిదు మండపాలు ఉన్నాయి. దాదాపుగా 46 ఎకరాలలో ఉన్న ఈ ఆలయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులు కానీ వారు ఉండరు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయం లో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాము..

ఈ ఆలయం లో పరమశివుడు నటరాజ స్వామి రూపం లో దర్శనం ఇస్తాడు. శివుడు నటరాజ స్వామి రూపం లో కొలువుదీరిన ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దక్షిణానికి అభిముఖంగా నిత్యం పూజలందుకుంటూ ఉన్న నటరాజ స్వామి ని చూడటానికి భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. నటరాజ స్వామి కి కుడి వైపున శ్రీ మహా విష్ణవు శ్రీ గోవింద రాజ స్వామి రూపంలో దర్శనం ఇస్తాడు.  శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ గోవింద రాజ స్వామి తూర్పు కు అభిముఖంగా దర్శనం ఇస్తాడు. 9 వ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృధ్ది చేశారు. వారు వైష్ణవ భక్తులు అవ్వడం వల్ల  గోవింద రాజ స్వామి నటరాజ స్వామి తో సమానంగా పూజలు అందుకునే వాడు..
Nataraaja swamy,... Govindharaja swamy

తరువాత కాలం లో చోళులు పల్లవుల ను ఓడించి చిదంబరాన్ని తమ పరిపాలనలో కి తెచ్చుకున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. చోళులు శివ భక్తులు అందువల్ల దక్షిణ భారత దేశంలో శైవ మత ప్రచారం ఎక్కువగా చేసేవారు. వైష్ణవ ఆలయాలు ఎన్నింటినో ధ్వంసం చేశారు. 11 వ శతాబ్దం లో చోళుల రాజైన కులోత్తుంగ చోళుడు అనే రాజు నటరాజ స్వామితో సమానంగా పూజలు అందుకుంటున్న గోవింద రాజ స్వామి విగ్రహాన్ని సముద్రం లో పడవేయాలని భావించాడు. గోవింద రాజ స్వామి వారిని ఆలయం నుండి బయటకు తీసుకుని వచ్చినపుడు ఎంతో మంది వైష్ణవులు అడ్డగించారు. ఆ రాజు తన సైనికుల కత్తులకు పని చెప్పాడు. ఎంతో మంది వైష్ణవుల రక్తం ఏరులై పారుతోంది. అయిన ఆ చోళ రాజు చలించకుండా గోవింద రాజ స్వామి విగ్రహాన్ని సముద్రంలో పడవేయించాడు.. తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ విగ్రహం బయట పడి ప్రస్తుతం తిరుపతిలో ఉంది..

చోళుల రాజ్యాలు పతనం అయిన తరువాత తెలుగు వాడైన కృష్ణప్ప నాయర్ అనే రాజు చిదంబర ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ రాజు విష్ణు భక్తుడు అవ్వడం వల్ల తిరిగి ఆలయం గోవింద రాజ స్వామి వారిని ప్రతిష్టించాలని తలిచాడు. ఎంతో మంది శైవులు దీనికి అడ్డుపడ్డారు. ఈ రాజు కూడా తన బలంతో శైవుల రక్తాలు కారుతుండగా గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశాడు. 
ప్రస్తుతం చిదంబరం లో శివకేశవుల విగ్రహాలు చిదంబరం లో ఉన్నాయి.ఇంత రక్త పాతం ఈ ఆలయానికి చరిత్రగా ఉంది. సముద్రం లో పడవేసిన విగ్రహాన్ని వైష్ణవ భక్తులు తిరుపతికి చేర్చి మంచినీళ్ళ గుంట ప్రదేశం లో ఉంచారు. 

To know  more 
# Interesting stories
# Devotional places

Comments

Popular posts from this blog

7th NOV 1979 AT TIRUMALA TEMPLE :

7th NOV 1979 AT TIRUMALA TEMPLE :   1976 లో తిరుమల : తిరుమల లో శ్రీనివాసుడు స్వయంభువు గ వెలిసి ఉన్నాడు అని చెప్పడానికి ఎప్పుడు ఏదో ఒక అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయి . ఆ వేంకటేశ్వరుడు తన భక్తులకు ఎప్పుడు అండగా ఉంటాడు అని చెప్పడానికి 1979 లో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుందాం .  ఈ సంవత్సరం లో తిరుమలలో నీటి నిలువలు బాగా తగ్గిపోయాయి . తిరుమల అంతటికి గోగర్భం రిజర్వాయరు నుండి నీటిని వినియోగించేవారు . ఆ రిజర్వాయరులో కూడా నీటి నిలువలు అడుగంటిపోయాయి . కొండా మీద ఉండే   ఇతర చెరువులు కూడా ఇంకిపోయాయి . ఆ సమయంలో టీటీడీ పరిపాలనాధికారి గా   PVRK ప్రసాద్   గారు ఉన్నారు . కొండా మీద ఉండే నీటి నిలువలు కేవలం వారం రోజులకు మాత్రమే సరిపోతాయని ఇంజినీర్లు చెప్పారు .   శ్రీ వారి దర్శనాన్ని కూడా నిలిపివేయాల్సి పరిస్థితి వచ్చేలా ఉందని టీటీడీ సభ్యులందరు సమావేశమయ్యారు . ఆ సమావేశంలో వర్షాలు పడటానికి యాగం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సలహా ఇచ్చారు .       PVRK ...

Govindhraaja Swamy temple mystery

GOVINDARAJA SWAMY TEMPLE MISTERY TIRUPATI: తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయ మిస్టరీ : తిరుపతి లో శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం గురించి మనందరికీ తెలుసు. చాలా మంది భక్తులు తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుపతిలో శ్రీ గోవింద రాజ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి అన్న గారుగా పిలువబడే గోవింద రాజ స్వామి వారి ఆలయం ఎలా నిర్మించబడినది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.ఈ ఆలయం యొక్క చరిత్రను చూస్తే మనకు ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తాయి. 1979 కి పూర్వం ఆలయం యొక్క సింహ ద్వారం తరువాత కుడి వైపున గోవింద రాజ స్వామి ఆలయం మరియు ఎడమ వైపు ఆండాళ్ అమ్మ వారి ఆలయం ఉండేవి. మధ్యలో  గోడ మాత్రమే ఉండేది. కానీ వెనక నుండి గమనిస్తే ఎదో ఒక గది ఉన్నట్లు గా ఉండేది. ఇది గమనించిన అప్పటి టీటీడీ పరిపాలన అధికారి PVRK ప్రసాద్ గారు మధ్యలో ఉండే గోడ గురించి పూజారులను అడిగారు. అయితే వారు చెప్పిన సమాధానం ఆయనకు సంతృప్తి గా అనిపించలేదు. పురాతన గ్రంధాలు చదివిన ఆయనకు అక్కడ శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయం ఉండేది అని తెలిసింది. అయితే ఆ ఆలయం ఏమైంది, గోవింద రాజ ...

TTD PROVIDES SERVICES TO PILGRIMS

తిరుపతిలో భక్తుల కోసం టీటీడీ అందించే సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో అనేక ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వారి దర్శనార్థం వేల కొలది భక్తులు తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవడం జరుగుతుంది. బస్సు ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం శ్రీనివాసం మరియు రైలు మార్గం ద్వారా వచ్చే భక్తుల వేచి ఉండటం మరియు విశ్రాంతి కోసం విష్ణు నివాసం పేరుతో పెద్ద భవనాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ online మరియు offline ద్వారా గదులు బుక్ చేసుకోవచ్చును. శ్రీ వారి దర్శనానికి ఇక్కడే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది.భక్తులకు ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి బస్సులను ఏర్పాటు చేశారు. అలిపిరి మేట్లు, శ్రీవారి మెట్ల వద్దకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి లోని వివిధ ఆలయాలలో దర్శన ఏర్పాట్లు,ప్రసాదం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలకు ఎక్కువ మంది మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు. అందువల్ల అలిపిరి మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంతో అందంగా సౌకర్య వంతంగా తీర్చి దిద్దారు. మార్గం లో మంచి నీటి సౌకర్యం మరియు ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.మార్గ మధ్...